9, ఆగస్టు 2012, గురువారం

శబరిమల యాత్ర.


శబరిమల కేరళ రాష్త్రంలోని పత్తినంతిట్ట జిల్లాలో వుంది.దట్టమైన అడవులతోనూ వన్య మ్రుగాలతోనూ నిండివున్న సహ్యాద్రి పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 4135 అడుగుల ఎత్తులో నెలకొని వుంది.లభిస్తున్న పురాణ,చారిత్రక ఆదారాలని బట్టి కలియుగంలో ఆఖరీ మరియూ ఏకైక దైవం అయ్యప్పే.కార్తీక మాసం నుండి అయ్యప్ప మాలాదారణలు ప్రారంభమౌతాయి.మాల దరించాలనుకునా భక్తుడు ముందుగా ఒక ఉత్తముడైన గురువుని ఎంచుకోవాలి.సాదారణంగా 5 పర్యాయలకన్నా ఎక్కువసార్లు మలాదారణ గావించి శబరిమల వెళ్ళివచ్చిన స్వాములను గురుస్వాములుగానూ,18 పర్యాయాలు శబరిమల వెళ్ళివచ్చిన స్వాములను పెద్ద గురుస్వాములుగా పిలుస్తారు.అయితే మనం తెలుసుకో వలసిన విషయం వారికి అయ్యప్ప పట్ల,శబరిమల యత్ర పట్లా ఎంత అవగాహన వుంది,వారు మిగతా స్వాములకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారా అని.కేవలం గణాంకాలని భట్టి కాక వారికున్న విషయ పరిజ్ణానాన్ని భట్టి గురువుని నిర్ణయించుకోవటం ఉత్తమం.మరైతే ఈ 5 సార్లు,18 సార్లు అన్న నియమాలను ఎందుకు పెట్టినట్లు?ప్రతీ భక్తుడు శభరీశుని డర్శించిన ప్రతీసారి కామ,క్రోద,లోభ,మోహాది అరిషడ్వర్గాలు,త్రిగుణాలు,విద్య,అవిద్యలను 18 రకాల వికారాలలో ఒక్కొక్క దుర్గుణాన్ని వదలిపెట్టి,ఆత్మను పరమాత్మలో విలీనం చేసే యత్నం చెయ్యలి.ఈ ప్రయత్నంలోనే వారు ఆ శభరీశుని యాత్రా వశిష్ట్యాన్ని,ఇరుముడి విదాన విశేషాన్ని,అయ్యప్ప తత్వాన్ని తెలుసుకుంటారు.దాని ఫలితంగా భక్తులు వారినుండి ఈ విషయాలన్నిటినీ తెలుసుకునే అవకాశం లభిస్తుంది.(కానీ ఇటీవలి కాలంలో గురుస్వామి అంటే కేవలం అదిక పర్యాయాలు గుడికి వెళ్ళివచ్చిన వాడై వుండి,ఇరుముడి కట్టటం వస్తే చాలు అనుకోవటం మన దురదృష్టం).



ఒక మంచి గురువుని  ఎన్నుకొనాక,దీక్ష తీసుకోవటానికి ముందురోజు పూర్తి ఉపవాసం ఉండాలి.అంతేకాని రేపటినుంచి కుదరదు కదా అని దుర్వ్యసనాలన్నిటినీ ఆరోజే తీర్చుకునే ప్రయత్నం చెయ్యకూడదు.కొందరు రాత్రి తాగినది దిగకుండానే మరుసటి రోజు మాలకు సిద్దమవుతున్నారు,ఇదిచాలా ఘోరమయిన తప్పిదమే కాక,కావాలని పాపాన్ని మూటకట్టుకోవడమే.ముందురోజు దేవాలయ సందర్శనం చేసి,ఉపవాసంతో గడిపాక,మన గురువుగారు సూచించిన శుభసమయంలో దగ్గరలోని అయ్యప్ప దేవాలయంలో  గురువు గారి చేతుల మీదుగా అయ్యప్ప దీక్ష తీసుకోవాలి.దీక్షా నియమాలన్నిటినీ గురువుగారు మాలాదారణ ముందే తెలియజేస్తారు.వాటన్నిటినీ త్రికరణశుద్దిగా పాటించాలి.దీక్షలో ఏవైన సందేహాలు వచ్చినట్లైతే గురువర్యులనడిగి తెలుసుకోవాలి.గురువు చెప్పే ప్రతీ విషయాన్ని శ్రద్దగా విని తూ.చ. తప్పక పాటించటమే కాక గురువుపై అచంచల విశ్వాసం కలిగివుండాలి.అయప్ప దీక్షా నిమాలని పైన వున్న పొస్టులలో అయ్యప దీక్షా నియమాలు అన్న శీర్షికలో జె.పి.జి ఫార్మాట్లో ఉంచటం జరిగింది,చదివి తెలుసుకొనగలరు.మండలకాలం దీక్ష 48 రోజులు ( మండలము అనగా ఒక మాసము+ఒక పక్షము+ మూడు రోజులు=30+15+3=48) ముగిసాక,గురువుగారు సూచించిన ఒక శుభముహూర్తాన మకర జ్యోతి దర్శణార్థం శభరియాత్రకు పయనమై ఇరుముడి కట్టించుకోవాలి.బందుమిత్రులు భిక్ష వేయగా గురువుగారు ఇరుముడి కడతారు.ఈ ఇరుముడిలో స్వామి అఘిషేకార్థం ఆవునేతితో నింపిన కొబ్బరికాయ,18 మెట్లవద్ద కొట్టేందుకు ఒక కొబ్బరికాయ,మాళిగాపుర మాత సన్నిదిలో దొర్లించేందుకు ఒక కొబ్బరికాయతో పాటు ఒక ఇరుముడి కిట్టు(అమ్మవారికోసం గాజులు,కాటుక మొ.వి),బందుమిత్రులు వేసిన భిక్షాబియ్యం ఉంటాయి.ఇరుముడి కట్టే కార్యక్రమం పూర్తయ్యేవరకూ పచ్చిగంగ కూడా ముట్టరాదు.ఇరుముడి కట్టే కార్యక్రమం పూర్తయ్యక,భోజనాలు చేసి సూర్యాస్తమయం అయ్యాక స్నానాలు,పూజా కార్యక్రమం ముగుంచుకుని శభరికి బయలు దేరుతారు.ఐతే ఇరిముడి కట్టుకున్న తరువాత ఏ సమయంలోనైన శబరికి బయలుదేరవచ్చు.


శ్రీ పేటై శాస్తా ఆలయం,ఎరుమేళి
శభరి యాత్రలో భక్తులు రోడ్డు లేద రైలు మార్గాల ద్వార ప్రయాణం చేసి ముందుగా ఎరుమేళి చేరుతారు.ఇక్కడ ముందుగా వావరు స్వామిని దర్శించుకున్నాకనే తనని దర్శిస్తారని అయ్యప్ప వావరుకు మాటిచ్చాడు.వావరు ఒక ఇస్లాం మతానికి చెందిన ఒక బందిపోటు దొంగ.సహ్య్తాద్రిలో ప్రయాణించె భాటసారులని దోచుకునేవాడు.అయ్యప్ప శబరికి పోతూవుండగా వావరు అడ్డగించాడట.నీవు ఈ విదంగా ప్రజలను ఎందుకు భాదిస్తున్నావని అయ్యప్ప వావరును అడిగాడు.తనకు అపరిమిత సంపదలు పొందాలని వుందనీ,వాటిని అనుభవించాలని చెప్తాడు వావరు.అయ్యప్ప వావరుకి అనేక మణులూ,రత్నాలు ఇస్తాడు.అయితే అవి వెంటనే రాళ్ళుగా మారిపోతాయి.వావరు కోపంతో ఏమిటీ మాయ అని అడుగుతాడు.దానికి అయ్యప్ప బదులిస్తూ స్రుష్టిలో ప్రతీ ఒక్కటీ అశాశ్వతమనీ,చివరికి ఏదైన ఇలా మట్టిలో కలసిపోవలసిందేనని చెప్తాడు.


వావరుస్వామి మసీదు,ఎరుమేళి.
ఆ మాటలు విన్న్న వావరుకు జ్ణానోదయమౌతుంది.అన్నిటినీ వదలి సత్యాన్వేషన సాగిస్తాడు.తాను ముస్లిమయ్యికూడా హైందవ వేదాంతాన్ని జీర్ణించుకోవటం వల్ల వావరుస్వామిగా పిలువబడి,అయ్యప్ప అనుగ్రహానికి పాత్రుడయ్యడు వావరు.కనుకనే అయ్యప్ప తనని దర్శించటానికి వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శిస్తారని వావరుకు మాటిచ్చాడు.ఎరుమేళిలో భక్తులు రంగులు చల్లుకుని ఆటవికుల వేషాలలో నృత్యం చేస్తూ పేటైశాస్తా సన్నిదిని దర్శించుకుని,ఆకాడినుంచి ఎదురుగా వున్న వావరు స్వామి మసీదుని దర్శిస్తారు.అక్కడినుంచి భక్తులు బాజాబజంత్రీలతో ఆనందంతో నృత్యం చెస్తూ శ్రీ ఎరుమేళి ధర్మశాస్తా సన్నిదికి వస్తారు.


పేటై తుళ్ళి నృత్యం,ఎరుమేళి.
ఈ ఆటవిక నృత్యం వెనుక ఒక విశేషం వుంది.అయ్యప్ప మహిషిని సంహరించే సమయంలో స్థానిక ఆటవికులు అయ్యప్పకి సాయం చేసి,అయ్యప్ప మహిషిని సంహరించాక సంతోషంతో నృత్యం చేసారట.దీనికి గుర్తుగా ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన భక్తులు ఆటవిక వేషాలలో నృత్యం చేస్తారు.శ్రీ ఎరుమేళి ధర్మశాస్తా సన్నిదికి చేరుకున్న భక్తులు అక్కడి ద్వజస్తంబం వద్ద వారి అలంకారాలను విసర్జించి,ఇక్కడి మణిమలా నదిలో స్నానం చెస్తారు.తరువాత శ్రీ ఎరుమేళి ధర్మశాస్తాని దర్శించుకుని 45 కి.మి. ఉన్న కఠినమైన వనయాత్రకు బయలుదేరుతారు.


పేరూరు థోడి.
వనయాత్రలో మొదట వచ్చే ప్రదేశం పేరూరు థొడి.ఈ నది వద్దనే అయ్యప్ప కొద్దిసేపు విశ్రాంతి తీసుకునాడట.ప్రతీ ఒకారూ ఇక్కడ తప్పక ఏదో ఒకటి ధానం చెస్తారు.ఇలా చెయ్యటం ద్వార భక్తుడు అన్నిటిని దానం చేసి స్వామిలో ఐక్యం అయ్యే యత్నం చేయాలన్నది పరమార్థం.తరువాత భక్తులు కాళైకట్టి చేరుకుంటారు.కాళైకట్టి అంటే "ఎద్దుని కట్టిన" అని అర్థం.అయ్యప్ప మహిషిని సంహరించే సమయంలో ఆ ఘట్టాన్ని చూడటానికి పార్వతీ,పరమేశ్వరులు నందినెక్కి ఇక్కడికి వచ్చారట.


కాళైకట్టి.
ఈ ప్రదేశంలోనే నందిని (శివుని వహనమైన ఎద్దుని)కట్టి వుంచారట.అందుకని దీనికాపేరు వచ్చిందని చెబుతారు.ఇక్కడ వున్న శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు తిరిగి యాత్రని ఆరంబించి 2 కి.మి ప్రయాణించాక అళుదా నదిని చేరుకుంటారు.అళుదా నది పంభానదికి ఒక ఉపనది.భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి అళుదా మేడు ఎక్కుతారు.ఇది చాల కఠినమైన ఎక్కుడు ప్రదేశం.దీన్ని ఎక్కటానికి ఎలాంటివారైన ఎంతో శ్రమకు లోనవ్వవలసిందే.


అళుదానది.
అళుదామేడు ఎక్కిన తరువాత భక్తులు "కళ్ళిడం కుండ్రు" అన్న ప్రదేశాన్ని చేరుతారు.అయ్యప్ప మహిషిని సంహరించాక మహిషి కళేబరాన్ని ఇక్కడ పూడ్చిపెట్టి అది తిరిగిరాకుండా ఆ ప్రదేశమంతా రాళ్ళతో నింపాడట.దీనికి గుర్తుగా అళుదా నదిలో స్నానం చేసేటప్పుడే భక్తులు తమతోపాటుగా కొన్ని రాళ్ళను తెచ్చి ఇక్కడ జారవిడుస్తారు.భక్తులు కఠినమైన ఈ వనయాత్రని పూర్తిచేసి చివరికి పావన పంభానదిని చేరుతారు.     (ఇంకావుంది).                                                                  

6, ఆగస్టు 2012, సోమవారం

శబరిమల అయ్యప్ప.





ఋగ్వేదంలో ప్రజ్ణానం బ్రహ్మ,యజుర్వేదంలో తత్వమసి,సామవేదంలో అహం బ్రహ్మాస్మి,అదర్వణవేదంలో అయం ఆత్మా బ్రహ్మ.ఈ సృష్టిలోని సకల చరాచర జీవరాశులన్నింటిలోనూ అంతర్లీనంగావున్న ఈశ్వర చైతన్యాన్ని గుర్తించమని చెప్పటమే వీటిలోని సారాంశమంతా.మాలవేసుకున్న భక్తునికీ,భగవంతునికీ మద్య వున్న సంబందాన్ని తేటతెల్లం చేస్తూ శబరిమల దేవస్తాన సన్నిదానంపై "తత్వమసి" అన్న పదాలు దర్శనమిస్తాయి.




తత్=అది,త్వం=నేనై,అసి=వున్నను.అంటే ఈశ్వర చైతన్యం ఏదైతే వుందో అది నేనై వున్నాను అని అర్దం.శబరిమలలో అయ్యప్ప చిన్ముద్రతో దర్శనమిస్తుంటాడు.చివరి మూడు వ్రేళ్ళు త్రిగుణాలకు గుర్తు.బ్రొటన వ్రేలు,చూపుడు వ్రేలూ ఆత్మా,పరమాత్మలకు గుర్తులు.అంటే త్రిగుణాలను త్యజించి ఆత్మను పరమాత్మలో లీనం చేయటంద్వరా భక్తుడు భగవంతుడవుతాడు.దేవతల భూమిగా పిలచే కేరళ రాష్టంలోని పత్తినంతిట్ట జిల్లాలోని సహ్యాద్రి పర్వత సానువులలో పంచగిరులపై వెలసిన పంచగిరీశుడే అయ్యప్ప.స్కందపురాణంలోనూ,కంభ రామాయణంలోనూ అయ్యప్ప జన్మవృత్తాంతం కనిపిస్తుంది.అయ్యప్ప జన్మ గూర్చి భక్తులకు వున్న కొద్దిపాటి సందేహాలనూ నివ్రుత్తి చేయాలన్నదే నా తపన.




మహిషి,మహిషాసురుల వృత్తాంతం:పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు చేయగా,బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏవరం కావాలో కోరుకోమని అడిగాడట.దానికి మహిషాసురుడు తనకు మరణం లేకుండా వరం ఇమ్మని అడుగగా దానికి ప్రజాపతి అలాంటివరం ఈవ్వటం కుదరదని మరో వరం కోరుకోమని చెప్పాడట.ఐతే తన రక్తపు బొట్టు నేలపై పడినప్పుడళ్ళా ఒక తనలాంటి మహిషాసురుడు పుట్టేలా వరం పొందాడు మహిషాసురుడు.ఆ వరంతో పొంగిపోయిన ఆ అసురుడు దేవతలనూ,ప్రజలనూ భాదించటం మొదలెట్టాడు.దేవతలంతా కలసి ఆ జగజ్జనని ప్రార్దించగా ఆ మహశక్తి ఆ అసురినితో యుద్దానికి దిగింది.




అతన్ని పొడిచిన ప్రతీసారీ క్రిందపడిన ఒక్కో రక్తపు బొట్టునుంచి ఒక్కో రాక్షసుడూ పుడుతూ వున్నాడట.అలా ఆ మహిషాసురుడు ఎంతకూ చావక పోవటంతో ఆగ్రహించిన ఆ శక్తి స్వరూపిణి మహాకాళిగా మారి తన నాలుకని ఆ రణరంగమంతా పరచి ఆ అసురిని రక్తాన్ని క్రిందపడకుండా తన నాలుకపై పడేలా చేసి ఆ మహిషాసురుని హతమార్చింది.మహిషి పూర్వ జన్మలో దత్తాత్రేయుని బార్య లీలావతి.దత్తాత్రేయుడు ఒకసారి తను వానప్రస్తానానికి(అనగా తపస్సు ఆచరించేందుకు)వెళుతున్నానని చెప్పగా,లీలావతి తనకు కామవాంచ ఇక నశించలేదనీ కనుక వానప్రస్తాన్ని వాయిదావేయమని అడుగుతుంది.ఎంతచెప్పినా వినకుండా కామోన్మాదంతో వున్న లీలావతిని మహిషివైపొమ్మని శపిస్తాడు దత్తాత్రేయుడు.ఆ శాపం కారణంగా మరుసటి జన్మలో మహిషాసురుని సోదరి అయిన మహిషిగా జన్మిస్తుంది.  



మహిషాసురిని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతని సోదరి అయిన మహిషి బ్రహ్మదేవునిగూర్చి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏవరం కావాలో అడుగగా మహిషి తన అన్నలాగే మరణం లేకుండా వరం అడిగిందట.దానికి బ్రహ్మ పుట్టిన ప్రతీజీవి గిట్టక తప్పదనీ,కనుక మరేదైనా వరం కోరుకోమని అడిగాడట.అయితే తనకు హరిహరుల పుత్రునివల్ల మరణం కలిగేలా వరం ఇమ్మని అడిగిందట.బ్రహ్మ ఆమెకు ఆ వరాన్ని ప్రసాదించి అదృశ్యమవగా హరిహరులకు పుత్రుడు కలగటం అసంభవం కనుక ఇక తనకు చావు లేదని మహిషి నిశ్చయించుకుని,ఇక తన అన్న చావుకి కారణమైన దేవతలపై పగ తీర్చుకోవాలని దేవతలనూ,మునులనూ,ప్రజలనూ హింసించటం మొదలుపెట్టింది.



రామునికి శ్రీ మహవిష్ణువుకీ సంభందం వుందని అందరికీ తెలుసు.ఐతే శక్తిశాలి ఐన హనుమంతునికీ పరమ శివునికీ సంభందం వున్నదని చాలా మందికి తెలియదు.పూర్వం ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువికీ, పరమ శివునికీ మద్య ఒక వాదన జరిగిందట.పురుషులను సైతం ఆకర్షించే అందం నారాయణుని సొంతం (ఈ విషయం రామాయణంలో పట్టాభిషేక ఘట్టంలోనూ కనిపిస్తుంది).అలాంటి నారయణుడు ఇక స్త్రీ రూపం దరిస్తే ఇంకేమైనా వుందా,సాక్షాత్తు పరమ శివునికైనా మనస్సు చలించాల్సిందే.ఈ విషయమై ఇదారి మద్యా వాదోపవాదాలు జరిగాక,తాను కనుక చలించినట్లైతే విష్ణువుకు దాస్యం చేస్తానని పరమ శివుడు అన్నాట్ట.ఆ తర్వాత భస్మసురిని సంహార సమయంలోనూ,క్షీరసాగర మదన సమయంలోనూ విష్ణువు మోహిని రూప దరుడైన విషయం మనకు తెలిసిందే.




ఆ సమయంలోనే శివుడు మోహినిని చూచి చలించగా రేతస్సు పతనమైనదట!ఆ రేతస్సునుంచి ఉద్భవించిన వాడే శ్రీ దర్మశాస్త.అంతేకానీ వారిద్దరిమద్య లైంగిక సంబందం వల్ల కాదు.అందులోనూ మహిషి తనకు శివ,కేశవులకు జన్మించిన వానివళ్ళనే మరణం రావాలని ప్రజాపతిని కోరింది కనుక,లోకకళ్యాణర్దం ఈ ఘట్టం జరుగుటలో శివ కేశవులు తమ భాద్యతలని నిర్వర్తించారు కానీ దీనిలో శివుని బలహీనత అంతకన్నా లేదు.ఐతే ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఆంజనేయునిగా త్రెతాయుగంలో శ్రీరామునికి సేవ చేసాడు.మన పురాణాలలో రేతస్సును కుండలో వుంచటంవల్ల ఉద్భవించిన కుంభసంభవుల గాథలు మనకు అనేకం కనిపిస్తాయి.మహా పురుషులంతా కుంభం నుంచి ఉద్భవిస్తారు అన్నదానికి గుర్తుగా మన పూజా కార్యక్రమాలలో దేవతలను కుంభం లేదా కలశంలోనికి ఆవాహన చేస్తుంటారు.మన రాష్ట్ర చిహ్నం కూడా పూర్ణ కుంభమే!అయ్యప్ప జన్మించాక వారు వెంటనే ఆయన్ని పంపా తీరంలో వదలివేయలేదు.ఆ బిడ్డకు శ్రీ దర్మశాస్తా అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.వినాయకునికి విఘ్నాదిపత్యం,స్కందునికి దెవసేనాదిపత్యం ఇచ్చినట్లు దర్మశాస్తాను భూథగణాలకు అదిపతిగా నియమించారు.




అందుకనే అయ్యప్పను భూతగణనాథుడు అనికూడా పిలుస్తారు.యుక్త వయస్సు వచ్చాక అయ్యప్పకు శ్రీ పూర్ణా దేవిని,పుష్కళాదేవితో వివాహం జరిపించారు.తదుపరి దేవతలంతా పరమ శివుని వద్దకు వచ్చి ధర్మశాస్తా అవతారానికి మూలమైన మహిషి సంహార కార్యాన్ని గుర్తు చేయగా అయ్యప్పని తిరిగి ఒక మానవ భాలునిగా మార్చి పావన పంభాతీరంలో వదిలి వెళ్ళటం జరిగింది(ధర్మశాస్తా విజయునికి ఇచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకొనే సరైన సమయమిదేనని భావించటం జరిగింది).విజయుని వృత్తాంతం:పూర్వ జన్మలో బ్రహ్మణుడైన విజయుడు సంతానం లేక ఎందరో ఋషులనూ,మునులనూ తనకు సంతానం కలిగేలా ఆశీర్వదించమని ప్రార్దిస్తూ చివరికి శబరి వద్దకు వెళ్ళాడట.శబరి అతనికి ఒక కుండ ఇచ్చి తన ఆశ్రమానికి ఉత్తరంగా వున్న కాలువనుంచి నీటిని తెమ్మని చెప్పిందట.విజయుడు కాలువ వద్దకు వెళ్ళి కుండలో నీళ్ళు ముంచుకుని తలపై పెట్టుకుని తిరిగి వస్తుండగా అది పొరపాటున జారి క్రింద పడిందట.




ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో వున్న విజయునికి ఎదురుగా ఒక భాలుడు కనిపించి ఏమికావాలని అడిగాడట.ఆ భాలుడి రూపాన్ని చూసి తన్మయత్వం చెందిన విజయుడు నువ్వు నా కుమారిడిగా ఉండాలని కోరాడట.దానికి భాలుని రూపంలో ఉన్న దర్మశాస్తా తథాస్తు అన్నాడట.ఆ విజయుడే తరువాతి జన్మలో పందల చక్రవర్తి ఐన రాజశేఖరునిగా పుట్టి,సంతనం లేక ఎన్నొ పూజలూ,నోములూ చేసాడు.ఒకసారి వేటకు వచ్చిన రాజశేఖరునికి,ఇచ్చిన మాట ప్రకారం దర్మశాస్తా పసిభాలునిగా పంబా తీరంలో మనికంటునిగా దర్శనమిచ్చాడు.సంతానంలేని తనకు భగవంత్ని వరప్రసాదంగా భావించిన పందళాదిపతి ఆ భాలుడిని తన రాజ్యానికి తీసుకునిపోయి తన రాణికి అప్పగించాడు.కంఠమునందు మణితో శివ,కేశవ తేజస్సుతో ఉట్టిపడుతున్న ఆ భాలునికి మణికంఠుడు అని పేరు పెట్ట్కూని కంటికి రెప్పలా పెంచారు రాజదంపతులు.




కొద్ది కాలానికే స్వామి దయ వల్ల వారికి ఒక మగబిడ్డ జన్మించాడు.(బహుశా తానొక్కడే ఐతే తనను వాళ్ళు వదులుకోలేరని స్వామి భావించాడేమో).రాజశేఖరుడు మనికంఠుడిని విధ్యాభ్యాసానికై గురుకులానికి పంపాడు.అక్కడ అస్త,శస్త్ర విద్యలతో పాటు సకల విద్యా పరంగతుడైన మనికంటుడు,గురుకులాన్ని వదిలి వెళ్ళే ముందు తన గురువుకు నమస్కరించి గురుదక్షిణగ ఏమివ్వలో చెప్పమని ప్రార్దించగా,గురువు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యడట.మనికంఠుడు ఆయ్యన్ని ఊదర్చి,తమ భాదను తనతో పంచుకోవలసిందిగా అడుగగా,ఆయన తన కుమారుడిని చూపించి వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు.పుట్టు చెవిటి,మూగ.నా దిగులంతా వాడిని గూర్చే అని చెప్పాడట.కరుణాసముద్రుడైన మనికంఠుడు తన గురువు భాదని చూసి తట్టుకోలేక ఆ భాలుడిని పిలచి తన కరములతో అతని కళ్ళను స్పర్శి,నాలికపై భీజాక్షరాలని వ్రాయగా అతనికి దృష్టి,వాక్కు రెండూ వచ్చాయట.




మణికంఠుడు దైవాంశ సంభూతుడని తెలియచెప్పిన మొదటి సంఘటన ఇది.రాజ్యానికి తిరిగి వచ్చాక మణికంఠునికి పట్టాభిషేకం చెయ్యలని తల్లిదండ్రులు నిశ్చయించారు.(తన తల్లికి ఇష్టంలేక అడవికి పంపినది అన్నది నిజం కాదు).దేవతల రాజైన ఇంద్రుడు మహిషిని సంహరించె సరయిన సమయం ఇదే అని భావించి,రాణికి శిరోవేదన వచ్చేలా చేస్తాడు,అంతేకాక తానే ఆస్తాన వైద్యుడి రూపంలో వచ్చి ఆ వ్యాదికి పులిపాలు మాత్రమే తగిన ఔషదమని చెప్తాడు. 




తల్లి భాదని చూసి తట్టుకోలేకపొయిన మణికంఠుడు తల్లిదండ్రులు వద్దని చెప్పిన వినకుండా పులిపాల కోసం బయలుదేరుతాడు.అయ్యప్పని తనని సంహరించటానికే దేవతలు అడవికి పంపారని తెలిసిన మహిషి ప్రతీకార జ్వాలతో మణికంఠునికి ఎదురవుతుంది.



అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవేంద్రుడు మణికంఠునికి తన జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు.తన కర్తవ్యాన్ని గ్రహించిన మణికంఠుడు మహిషిని సంహరిస్తాడు.దేవేంద్రుడు,ఇతర దేవతలూ పులులుగా మారి మణికంఠుని పందళరాజ్యానికి చేరుస్తారు.




పులి వాహనుడై వస్తున్న మణికంఠుడిని చూసి రాజ దంపతులే కాక పందళ ప్రజలంతా ఆశ్చర్య పొతారు.స్వామి శక్తిని తెలియజెప్పిన మరో ఘటన ఇది.రాజదంపతులు మణికంఠునికి పట్టాభిషేకం చేయాలని మరోసారి నిర్నయించుకోగా,మణికంఠుడు తాను సన్యసించాలని నిర్నయించుకున్నట్లు చెప్తాడు,తాను భాణాన్ని సందించి వదులుతానని అది పడిన ప్రదేశంలో తనకు ఒక ఆలయం నిర్మించమని తన తండ్రితో చెప్తాడు.




అలా మొదట భాణం పడిన ప్రదేశం సారంకుత్తి అనీ,రెండో భాణం పడిన ప్రదేశంలో సన్నిదానాన్ని నిర్మించటం జరిగింది.ఐతే అయ్యప్ప తన అవతారానికి మూలమైన మహిషి సంహారం తర్వాత హాయిగా తిరిగి కైలాసానికి వెళ్ళి చక్రవర్తిలా వుండక శబరిమలలో ఆలయం నిర్మించమని పందళ రాజుకి చెప్పి,ఎందుకు అక్కడే ధ్యాననిమగ్నుడై వుండిపొయినట్లు?




ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి.అయ్యప్ప ఒకసారి అడవిలో వెలుతుండగా రామనామాంకిత ధ్యానంలో వున్న హనుమంతుడు కనిపిస్తాడు.సాక్షాత్తు శ్రీరాముడే అయిన అయ్యప్పను చూసి హనుమంతుడు పులకరించిపోతాడు(అంటే తాను శీవ,కేశవ అంశ కనుక, శివాయ విష్ణు రూపాయ,శివ రూపాయ విష్ణవే అని పద్మపురాణం చెప్తుంది).




కలియుగంలో ప్రజలు పాప భీతి లేకుండా వున్నారనీ,నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ఉత్తమమైన మానవ జన్మ పరమార్దం గ్రహించక పాపకూపంలో చిక్కుకుంటున్నరని బాదపడతాడు హనుమ.ప్రజలను భక్తి మార్గంవైపు మళ్ళించి తాను గీతలో చెప్పిన కర్మ సిద్దాంతాన్ని ఆచరించేలా చేస్తానని హనుమకు మాటిచ్చాడు మణికంఠుడు.



అంతేకాక ప్రజలను పట్టి పీడిస్తున్న శనీశ్వరుని తన భక్తుల జోలికి రాకుండా వుండాలని స్వామి ఆజ్ణాపించాడు.అందుకోసం శనికి ప్రీతి కలగచేయుటకై తన దీక్షను తీసుకున్న భక్తులు శనికి ఇష్టమైన నల్లని బట్టలే దరిస్తారనీ,శనిపెట్టే భాదలన్నిటినీ మండలకాల దీక్షలో నియమాల రూపంలో సంతోషంగా ఆచరిస్తారనీ శనేశ్వరునికి మాటిచ్చాడు.




మనం సరిగ్గా గమనించినట్లైతే గనుక ప్రతీ ఏడాది కొన్ని లక్షలమంది భక్తులు మాలాధారణ చేసి నలబై రోజులు (నిజానికిది 48 రోజులు.మండలము అనగా ఒక మాసము+ఒక పక్షము+మూడు దినములు=30+15+3=48 రోజులు)దీక్షలో వుండి అయ్యప్పని దర్శిస్తూ వున్నారు.సంవత్సరంలో కనీసం రెండు నెలలు వారిని భక్తులుగా,మంచి మార్గంలో వుంచేలా చేస్తున్నది ఈ మాలాదారణే.ఈ సమయంలో క్రైమెరేటు కూడా చాలా తగ్గిపోతుంది అంటే దాని ప్రభావాన్ని అర్దం చేసుకోవచ్చు.మనకోసమే ఆ శభరీశుడు బ్రహ్మచారిగా ఆ శభరిగిరిపై శాశ్వతంగా ధ్యాననిమగ్నుడయ్యాడు.




మకరజ్యోతి గురించి వాస్తవాలు: మణికంఠుడు తాను ప్రతీ యేడాది మకర సంక్రాంతి రోజున కాంతమలపై జ్యోతి రూపంలో కనిపిస్తానని ఆ సమయంలో తనకు ఆభరణాలు అలంకరించుకొని తమ కోరిక తీర్చుకోమని తన తండ్రితో చెప్పాడు.అన్నమాట ప్రకారం ఇప్పటికీ ఆ కాంతమలపై మకర సంక్రాంతి రోజున జ్యోతిరూపంలో దర్శనమిస్తుంటాడు.ఆ దివ్య జ్యోతి పూర్తి వైరాగ్యంతో,సకల జీవుల ఎడల సమదృష్టిని కలిగి ఎవ్వరినీ నొప్పించక ఆ శభరీశుడే సర్వస్వంగా భావించే మహభక్తులకు మాత్రమే దర్శనమిస్తుంది.కానీ అల్లంటి భక్తులు ఎంతమంది వున్నారు?అదిక సంఖ్యలో వున్న సధారణ భక్తులకు ఆ దివ్య జ్యోతి కనిపించె అవకాశమే లేదు.ఐతె ఇది చివరికి అసలు జ్యొతే లేదనే స్తితికి దిగజారవచ్చనే వుద్దేశ్యంతో మకర విళక్కు(దేవాలయం వారే జ్యోతిని వెలిగించటం)అనే సాంప్రదాయాన్ని ప్రారంభిచ్టం జరిగింది.ఈ విషయం ఎన్నో సంవత్సరాలానుండి శబరికి వస్తున్న గురుస్వాములందరికీ తెలిసిందే.ఈ విషయాన్ని తెలుసుకోలేక కొందరు ఆ దివ్య జ్యోతినే అనుమానించటం ఇటీవల జరుగుతున్నది.




ఈ విషయాన్ని భక్తులకు అర్దమయ్యేలా ముందే చెప్పక పోవటం,పైగా కనిపించేదే నిజమైన జ్యోతని నమ్మించటానికి ప్రయత్నించటం ట్రావెంకోర్ దేవస్వం బోర్డు చేసిన పెద్ద తప్పిదం అని నా అభిప్రాయం.నేను గత 14 సంవత్సరాలుగా శబరిమల వెళ్ళివస్తున్నాను.కానీ నాకు చిన్నతనం నుంచే అయ్యప్ప పట్ల అమిత భక్తి ఏర్పడింది.నా జీవితంలో జరిగిన అనుభవాలు అయ్యప్ప వునికిని నాకు తెలిసేల చేసాయి.ఎవరికైనా శబరిమల యాత్ర గూర్చి తెలుసుకోవాలని వుంటె పైన వున్న ఆర్చివ్ లో శబరిమల యాత్ర అన్న పొస్ట్ చదవండి.మీ అభిప్రాయాలని క్రింద కామెంట్స్ లో తెలియజేయండి.స్వామి శరణం.          

5, ఆగస్టు 2012, ఆదివారం

రామేశ్వరం.


రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వుంది.ఇది బంగాళాఖాతంలో వున్న ఒక దీవి.మన పురాణాలలో కాశీ తర్వాత అంతటి  ప్రాశశ్త్యం కలిగివుండటమే కాక దక్షిణకాశీగా పిలువబడుతుంది.రామేశ్వరం మన్నార్ సిందూశాఖలో వుంది.త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వానరసేనతో కలసి లంకకి వారథి నిర్మించింది(ధనుష్కోటి)ఇక్కడినుంచే.



రావణ సమ్హారం అనంతరం శ్రీరాముడు మహర్షుల సలహాపై బ్రహ్మహత్యా దోషనివారణార్థం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి ప్రత్యేకపూజలు నిర్వహించాలని ఆంజనేయుని కైలాసపర్వతానికి వెళ్ళి శివలింగాన్ని తెమ్మని ఆజ్ణాపించాడట.కానీ ఆంజనేయుడు ముహూర్త సమయానికి రాకపొవటంతో సీతాదేవి ఇసుకతో ఒక సైకతలింగాన్ని తయారుచేసిందట.



మరికొద్దిసేపటికే ఆంజనేయుడు శివలింగంతో తిరిగిరాగా,రఘురాముడు ఆంజనేయుడు నొచ్చుకోకుండా ఆ లింగాన్నికూడా సైకతలింగం ప్రక్కనే ష్టించాడట.ఆంజనేయుడు తెచ్చిన లింగాన్ని "విశ్వలింగం" అంటారు.పూజాకార్యక్రమాలు ముందుగా విశ్వలింగానికే నిర్వహించేలా శ్రీరాముడు ఆదేశించాడట.


రామునిచే ప్రతిష్టించబడటంవల్ల స్వామివారిని (సైకతలింగం)శ్రీ రామనాథస్వామిగానూ ఈ క్షేత్రం "రామేశ్వరం"గానూ పిలువబడుతుంది.రామేశ్వరం దర్శిస్తేనే కాశీయాత్ర సంపూర్ణమైనట్లుగా భావిస్తారు.



ఈ ఆలయంలోని శ్రీ రామనాథస్వామిలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటి.రామేశ్వరం దేవాలయ ప్రాకారం వైశాల్యరీత్యా ప్రపంచ ప్రశిద్దిగాంచింది.3.6 మీ. పొడవైన శిలాస్థంభాలపై అద్భుతరీతిలో చెక్కిన శిల్ప సంపద వీక్షకుల్ని అబ్భురపరుస్తుంది.




ఇక్కడికి కొద్దిదూరంలో శ్రీరాముడు పూజ నిర్వహించిన అగ్నితీర్థం వుంది.దగ్గరలోనే దర్శించతగ్గ మరో ప్రదేశం గందమాదన పర్వతం.ఇది రామేశ్వరానికి 2 కి.మీ. దూరంలో వుంది.



పురాణాల ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ చిరంజీవిగా వుండి ఈ ప్రాంతంలోనే రామనామద్యానంలో వున్నాడని ప్రతీతి.తరువాత చెప్పుకోదగిన ప్రదేశం దనుష్కోటి.ఇది రామేశ్వరానికి 8 కి.మీ. దూరంలో వుంది.ఇక్కడినుంచే రామదండు లంకానగరానికి వారథి నిర్మించింది.


రామనామం వ్రాయబడి నీటిపై తేలాడే రాళ్ళను మనం ఇక్కడ చూడొచ్చు.రామేశ్వరం గొప్ప పుణ్యక్షేత్రమే కాక ప్రకృతి ప్రియులకు స్వర్గదామంలాంటిది.ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆశ్వాదించటానికి కేవలం భారతీయులేకాక విదేశీయులుకూడా వస్తుంటారు.   

రామేశ్వరం నుంచి శ్రీలంకకి నిర్మించిన వారధి.

మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి.



మేము మా శబరిమల యాత్రలో భాగంగా ఒకసారి మేల్మరువత్తూర్ వెళ్ళటం తటస్థించింది.ఇక్కడి ఆదిపరాశక్తి గుడి చాలా ప్రసిద్దిగాంచింది.ఒక్కసారి దర్శిస్తే ఎప్పటికీ మరచిపోలేని ముగ్దమనోహర రూపం అమ్మవారిది.భగవంతుని ముందు అందరూ సమానమనే విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా పాటిస్తారు.దానినే తమిళ భాషలో "ఒన్రె కులం,ఒరువనే దేవం" అని అంటారు.అంటే ఒకే కులం,ఒకే దైవం అని అర్దం. 


భక్తులెవరైనా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మని ప్రార్దించే మహత్తర అవకాశం ఈ ఆలయంలో వుంది.ఈ దేవాలయ స్థాపకులు శ్రీ బంగారు నాయకర్.అనేక సంస్థలు,సేవా ట్రస్తులు వీరి ఆద్వర్యంలో నడపబడుతున్నాయి.ఈ దేవలయం ఉన్నచోట దట్టమైన అటవీ ప్రాంతం వుంది.ఇక్కడే ఒక వేపచెట్టు వుండేదట.దానినుంచి కారే పాలు చాలా తియ్యగా వుండటమేకాక ఎన్నో వ్యాదులని నయంచేసే శక్తిని కలిగివుండేదట.


1966 లో వచ్చిన తుఫానులో ఈ మహావృక్షం కూలిపోగా అక్కడ ఒక స్వయంభు లింగం  బయల్పడింది.అది సాక్షాత్తు ఆదిపరాశక్తిచేత పూజలందుకునే లింగంగా భావించిన భక్తులు ఆ లింగాన్ని అమ్మవారి ముందు ప్రతిష్టించారు.ఇక్కడి ఆదిపరాశక్తి ధృవమూర్తి పద్మం మద్యలో ఆసీనురాలై దర్శనమిస్తుంది.



ఈ ఆలయంలో చెప్పుకో దగినది పుదుమండపం.ఈ మండపంలోనే ఆదిశక్తి నాగదేవత రూపంలో తపస్సు చేసిందట.దీనికి గుర్తుగా ఈమండపాన్ని నిర్మించటం జరిగింది.దీనినే సర్పకన్యా మండపం అనికూడా అంటారు.ఇక్కడికి దగ్గరలోనే అథర్వణ భద్రకాళీ ఆలయం వుంది.ఇక్కడ భక్తులతోపాటు ఆలయ సిబ్బంది ఎర్రని వస్త్రాలు దరిస్తారు.



ఏ కులమైన,ఏ మతమైనా అందరూ సమానమే అందరి రక్తం వుండేది ఎరుపు రంగులోనే అన్నది ఇందులోని పరమార్దం.ఇక్కడ అమ్మవారి మాలాధారణ చేసిన భక్తులు భక్తిశ్రద్దలతో ఇరుముడులు సమర్పిస్తుంటారు.


మేల్మరువత్తూర్లో నన్ను భాగా ఆకర్షించిన విషయం శుచీ,శుభ్రత.దేవాలయ ప్రాంగణమేకాక,ఇక్కడి రైల్వే స్టేషన్ కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది.నడిచేటప్పుడు నా కాలి అడుగులు  పడతాయేమో అని నేను భయపడ్డానంటే ఎంత శుభ్రంగా వుంటుందో ఊహించుకోవచ్చు.  

4, ఆగస్టు 2012, శనివారం

కన్యాకుమారి.



కన్యాకుమారినే "కన్నియాకుమారి" అని స్థానికంగా పిలుస్తారు.కన్యాకుమారికి ఒకవైపు తిరునల్వేళి జిల్లా,ఒకవైపు  కేరళ రాష్ట్రం,మరొకవైపు బంగళఖాతం,అరేబియా,హిందూ సముద్రాల కలసిన త్రివేనీ సంగమం హద్దులుగా ఉన్నాయి.కన్యాకుమారి భారతదేశ ప్రదాన భూభాగపు సరిహద్దు మాత్రమేకాక కన్నియాకుమారి జిల్లా ముఖ్యపట్టణం కూడా.స్థానిక ముఖ్య దేవతైన కన్యాకుమారి అమ్మవారి పేరుమీదుగా ఈ జిల్లాకి ఆ పేరు వచ్చింది.


                                    కన్యాకుమారి ఆలయం
నేను ప్రతీ యేడాది అయ్యప్ప మాల వేసుకుంటాను,యాత్రలలో భాగంగా ప్రతీసారి కన్యాకుమారిని దర్శిస్తూవుంటాను.అంతేకాదు 2004లో సునామీ వచ్చినప్పుడుకూడా నేను అక్కడే ఉన్నాను.పోలీసుల అప్రమత్తతవల్ల మేము తప్పించుకొని రాగలిగాము.అసలు విషయానికి వద్దాం.




స్థలపురాణం ప్రకారం పార్వతీదేవి అంశ అయిన కన్యాకుమారి ఒకానొకప్పుడు ఈ ప్రదేశంలోని ఒక రాతిపై పరమశివునికై ఘోర తపస్సు చేసి శివునిలో ఐక్యమయ్యిందట.తాను పెళ్ళికాని కన్య కనుక కన్యాకుమారిగా పిలువబడింది.పూర్వం ఈ ప్రాంతం ట్రావెంకోర్ ధాన్యాగారంగా పిలువబడేది.




చాలకాలంపాటు ట్రవెంకోర్లో భాగంగా వుండి 1956లో భాషా ప్రయుక్తరాష్టాల పునర్విభజనలో తమిళనాడులో కలసింది.కన్యాకుమారి బీచ్ చాలా అందంగా వుంటుంది.ఐతే బీచ్లో చాలా రాళ్ళు,చిన్న చిన్న కొండలు వుండటంవల్ల సముద్ర ఉద్రుథి ఎక్కువగా వుండి బలంగా మనుషుల్ని కూడా రాళ్ళపై విసిరేసేలా వుండటంతో ప్రజల్ని హెచ్చరించటానికి ఇక్కడ పోలీసుల నిఘాకూడా వుంటుంది.


                                  వివేకానంద మెమోరియల్
ఇక్కడి ఆలయంలో కన్యాకుమారిదేవికి నిత్యం విశేష పూజలు జరుగుతుంటాయి.ఆలయానికి సమీపంలోనే గాందీమండపం వుంది.ఇక్కడే మహాత్ముని చితాభస్మాని త్రివేనీ సంగమంలో కలపటానికి ముందుగా ప్రజల దర్శనార్దం వుంచటం జరిగింది.ఈ మండపాన్ని ఒరియాశైలిలో నిర్మించారు.


                                           గాంధీ మండపం
1892 డిసెంబర్ 25న స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చి ఒక రాతిపై రాత్రంతా ద్యానంలో నిమగ్నమై భారతీయ హిందూ వేదాంతాన్ని దేశదేశాలలో వ్యాపింపచేయాలని నిశ్చయించుకున్నారట.ఆ మరుసటి యేడాదే ఆయన ప్రపంచ మతసభలకు హాజరవ్వటం జరిగింది.


                                     తిరువెళ్ళువార్ విగ్రహం
దీనికి గుర్తుగా ఆ రాయివున్న ప్రదేశంలో వివేకానందా మెమోరియల్ని నిర్మించటం జరిగింది.దాని ప్రక్కనే గొప్ప తమిళ కవి.రుషి పుంగవుడు అయిన 133 అడుగుల శ్రీ తిరువెళ్ళువార్ విగ్రహం వుంది.కన్యాకుమారిలో చెప్పుకో తగినది సూర్యోదయ,సూర్యాస్తమయ సమయాలలో సూర్యకిరణాలు సముద్రంపై పడినప్పుడు ఆ దౄశ్యం చాలా అద్భుతంగా వుంటుంది. 




కన్యాకుమారి వచ్చిన యాత్రీకులను ఇక్కడ అమితంగా ఆకర్షించేది షాపింగ్.రకరకాల గవ్వలూ,పూసలు ఇక్కడి ప్రత్యేకం.వీటితోపాటు ప్రతీ వస్తువూ ఇక్కడ దొరుకుతుంది.




ఏ వస్తువైనా 5రూ.,10రూ.సాంప్రదాయం ఇక్కడే ప్రారంభమయ్యింది.ఇక్కడికి వచ్చినవళ్ళు గుడికెళ్ళటమైనా మానేస్తారేమొకానీ షాపింగ్ మాత్రం తప్పక చేస్తారు.